జర్నలిస్టుల సంక్షేమమే టీజేయు లక్ష్యం
– టీజెయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్
- కుత్బుల్లాపూర్ నియోజక వర్గ టీజేయు కార్యాలయం ప్రారంభం..
- హాజరైన పలువురు నేతలు… అభినందన వెల్లువలు
న్యూస్ 6 డెస్క్ హైదరాబాద్ మే 30
ప్రతి జర్నలిస్టు సంక్షేమం కోసమే తెలంగాణ జర్నలిస్టు యూనియన్ పాటు పడుతుందని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కప్పరా ప్రసాద్ రావు పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం యూనియన్ కార్యాలయాన్ని ఆయన గాజుల రామారావు డివిజన్ పరిధిలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కప్పర ప్రసాద్ రావు మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి తలొంచి జర్నలిస్టుల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ప్రతి జర్నలిస్టు సంక్షేమం కోసం పాటుపడుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కార్యాలయానికి అతిధులుగా విచ్చేసిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని హామీ ఇచ్చారు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ యూనియన్ ఏర్పడ్డ కొద్ది రోజుల్లోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కార్యాలయం సందర్శించి నూతన కార్యవర్గాన్ని అభినందించారు.తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ కార్యాలయ ప్రారంభోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు ఎమ్మెల్యే చేతి వివేకానంద ఆదాబ్ హైదరాబాద్ ఎడిటర్ వీరమల్లు సత్యం ఐ ఎఫ్ డబ్ల్యూ జె జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి,రాష్ట్ర కార్యదర్శి బాపురావురావుప్రశ్న ఆయుధం ఎడిటర్,గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రామకృష్ణ మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షులు వలపు శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దేవులపల్లి ఎల్లయ్య గార్లతో కలిసి పాల్గొని కుత్బుల్లాపూర్ అధ్యక్షులు నరసింహారావు ప్రధాన కార్యదర్శి సత్యం వారి బృందానికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది